వాహనం ముందు సీటులో ఎయిర్బ్యాగ్ తప్పనిసరి
By: chandrasekar Tue, 29 Dec 2020 9:55 PM
వాహనం ముందు సీటులో
ప్రయాణీకులకు ఎయిర్బ్యాగ్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ప్రమాదాలు జరిగితే ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడం కోసం ఈ చర్యలు చేపట్టారు.
దీనికి సంబంధించి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రయాణీకుల భద్రతను పెంచడానికి ఒక ముఖ్యమైన చర్యగా, రోడ్డు రవాణా మరియు
రహదారుల మంత్రిత్వ శాఖ ఒక వాహనం ముందు సీటులో, డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు ఎయిర్ బ్యాగ్
అందించడం తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ చర్యను అమలు చేయడానికి
కాలపరిమితులు ఏప్రిల్ 1, 2021 కొత్త మోడళ్లకు మరియు ప్రస్తుత మోడళ్లకు జూన్ 1, 2021 గా నిర్దారించబడింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో
ప్రచురించబడిందని ఒక ప్రకటనలో తెలిపింది.