రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సాహసికుడు...
By: chandrasekar Sat, 12 Dec 2020 5:04 PM
100 ఏళ్ల ప్రీతిపాల్ సింగ్ గిల్ రెండో ప్రపంచ యుద్ధంలో
పాల్గొన్న సాహసికుడు. అతను తన పుట్టిన రోజు పండుగని కుటుంబ సభ్యుల మధ్య వేడుకగా
జరుపుకున్నారు. ఆర్మీలో కల్నల్గా రిటైర్ అయిన ప్రీతిపాల్ సింగ్ గిల్ వందేళ్లు
పూర్తి చేసుకున్న సందర్భం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గురువారం తన నూరవ
పుట్టిన రోజు నాడు బొటనవేలు పైకెత్తి చూపిస్తూ ప్రీతిపాల్ పోస్టు చేసిన ఫొటోకి
నెటిజన్లు హర్షం వ్యక్తం చేసారు. పంజాబ్లోని ఫరీద్కోట జిల్లా పాఖీ గ్రామానికి
చెందిన ప్రీతిపాల్ కుటుంబం తరతరాల నుంచి సైన్యంలోనే పనిచేస్తోంది. కార్గో నౌకలకు
ఎస్కార్ట్గా ప్రీతిపాల్సింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారు.
కొన్నేళ్ల తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆర్మీకి బదిలీ
చేశారు. 1920
డిసెంబర్ 11న పాటియాలాలో పుట్టిన ప్రీతిపాల్ సింగ్ 1942లో
భారత వాయుసేనలో చేరారు. అయితే ఆయన తండ్రి విమానాల ప్రమాదాలు జరుగుతాయని నేవీకి
మార్చారు.
మణిపూర్లో అస్సాం
రైఫిల్స్ సెక్టార్ కమాండర్గా పని చేస్తూ 1970లో రిటైర్ అయ్యారు. 1965లో పాకిస్తాన్తో జరిగిన
యుద్ధంలో పాల్గొన్నారు. పదవీ విరమణ తర్వాత తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ
జీవనం సాగిస్తున్నారు. భార్య ప్రమీందర్ కౌర్కి 95 ఏళ్లు. వారిద్దరికీ ఒకే
కుమారుడు ఉన్నారు. సింగ్ శరీరానికే వయసు వచ్చిందే తప్ప ఆయన మనసు ఎప్పుడూ
ఉరకలేస్తూ ఉంటాడని ప్రీతిపాల్ మనవడు అభయ్పాల్ చెప్పారు. పంజాబ్ ముఖ్యమంత్రి
అమరీందర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.