Advertisement

  • మర్డర్ సినిమాపై మరొకసారి కోర్టుకెక్కిన అమృత ...

మర్డర్ సినిమాపై మరొకసారి కోర్టుకెక్కిన అమృత ...

By: Sankar Wed, 23 Dec 2020 7:46 PM

మర్డర్ సినిమాపై మరొకసారి కోర్టుకెక్కిన అమృత ...


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వివాదాలతో మరింత దగ్గరగా సవాహసం చేస్తున్నాడు...కరోనా లాక్ డౌన్ టైం నుంచి తనలోని దర్శకుడిని నిద్రలేపిన వర్మ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు...ఇందులో భాగంగా వర్మ తీసిన చిత్రం మర్డర్...యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు వర్మ తెలిపాడు..

అయితే ఈ సినిమా తమ కథతోనే తీస్తున్నాడు అని మిర్యాలగూడలో పరువు హత్యకు గురి అయిన ప్రణయ్ భార్య అమృత కోర్టుకెక్కింది..అయితే కోర్ట్ మాత్రం ఈ సినిమా విడుదలకు పర్మిషన్ ఇచ్చింది..దీనితో రేపు ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది..అయితే ఈ నేపథ్యంలో అమృత మరొకసారి కోర్టులో కేసు వేసింది...

దీనికి కారణం సినీ దర్శకుడు వర్మ నిన్న ఈ సినిమా ప్రివ్యూ షోను వేయడం. దాంతో తన కథనే ఆధారంగానే సినిమాను రూపొందించారని అమృత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా తమ తెలివితేటలతో తన కథనే చిత్రంగా తీసి..కోర్టును తప్పుదోవపట్టించారని, ఈ పిటిషన్‌ను విచారించాలని హైకోర్టును అమృత కోరింది. అయితే ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకార్టు నిరాకరించింది. హైకార్టు విచారణకు నిరాకరించడంతో చిత్ర యూనిట్ రేపు సినిమా విడుదలకు సిద్ధమైంది.

Tags :
|
|
|

Advertisement