Advertisement

అభిమానుల కోసం అమితాబ్ ట్వీట్

By: chandrasekar Thu, 16 July 2020 1:05 PM

అభిమానుల కోసం అమితాబ్ ట్వీట్


రోజురోజుకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్‌‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరూ ప్రస్తుతం ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బిగ్ బి కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలకు కూడా పాజిటివ్‌ వచ్చినా, ఇద్దరూ ఇంటి వద్దే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. అమితాబ్, అభిషేక్‌ చికిత్సకు చక్కగా సహకరిస్తున్నారని, ఇద్దరు కోలుకుంటున్నారని, మరో వారం రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు పేర్కొన్నారు.

మరోవైపు ఆస్పత్రిలో ఉన్నా కూడా అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా అభిమానుల కోసం ఆయన ఓ పోస్టు కూడా పెట్టారు. ''మీ ప్రేమాభిమానాల వరదలో తడిసి ముద్దవుతున్నాను. మీ ప్రేమకు ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు.

ప్రస్తుతానికి నేను చీకటిలో ఉన్నాను. మీ అందరి అభిమానానికి తలవంచి నమస్కరిస్తున్నాను'' అని ఆస్పత్రిలో చేరాక అమితాబ్‌ సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. బిగ్ బీ త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు సైతం పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.

బిగ్ భార్య జయాబచ్చన్ కు నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కూడా హోం ఐసోలేషన్లో వున్నారు.అమితాబ్ వయసు 77 ఏళ్లు. అయితే ఆయనకు కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నా కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించి నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Tags :
|
|
|
|

Advertisement