Advertisement

  • కరోనావైరస్ నెగెటీవ్ రిపోర్ట్‌పై ఘాటుగా స్పందించిన అమితాబ్

కరోనావైరస్ నెగెటీవ్ రిపోర్ట్‌పై ఘాటుగా స్పందించిన అమితాబ్

By: chandrasekar Fri, 24 July 2020 09:00 AM

కరోనావైరస్ నెగెటీవ్ రిపోర్ట్‌పై ఘాటుగా స్పందించిన అమితాబ్


కొద్ది కాలం క్రితం కరోనావైరస్ సంక్రమించడంతో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారు. తన ట్విట్టర్ ఎకౌంట్‌లో తన గురించి వచ్చిన ఒక తప్పుడు వార్తపై ఆయన స్పందిస్తూ ఆ సంస్థపై ఫైరయ్యారు. ఈ విషయం ఫై బాలీవుడ్ షెహెంషా అమితాబ్ బచ్చన్‌కు కోపం వచ్చింది.

అమితాబ్‌తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. అయితే తాజాగా తను కోలుకున్నానని కరోనావైరస్ రిపోర్ట్‌లో నెగెటీవ్ వచ్చింది అనే వార్త రావడంతో అమితాబ్ బచ్చన్ దాని గురించి ఘాటుగా స్పందించారు.

తనకు కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలో నెగెటీవ్ వచ్చిన వార్తలో నిజం లేదు అని తెలిపారు. అది పచ్చి అబద్ధం అని, పూర్తిగా నిర్లక్ష్యపూరితమైనది అని అమితాబ్ మండిపడ్డారు. కొన్ని వార్త సంస్థలు ఈ విధంగా పోస్ట్ చేయడంతో అనేక ప్రసార మాధ్యమాల్లో అదే వార్తను క్యారీ చేశారు.

Tags :
|

Advertisement