Advertisement

  • హీటెక్కిన జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం ...రేపు హైదరాబాద్ రానున్న అమిత్ షా

హీటెక్కిన జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం ...రేపు హైదరాబాద్ రానున్న అమిత్ షా

By: Sankar Sat, 28 Nov 2020 7:53 PM

హీటెక్కిన జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం ...రేపు హైదరాబాద్ రానున్న అమిత్ షా


భాగ్యనగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసే సమయం ఆసన్నమవుతున్నా కొద్దీ… పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆ పార్టీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది.

ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం జీహెచ్ఎంసీలో తన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2 అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంటరవుతున్నారు.

బల్దియా ఎన్నికల ప్రచారం కోసం హోంమంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్‌కు వస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నేరుగా చార్మినార్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించనున్నారు. దాదాపు 30 నిమిషాల పాలు ఆయన ఆలయం వద్దే ఉంటారని తెలుస్తోంది. ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడలో అమిత్ షా రోడ్‌ షో నిర్వహిస్తారు.

అమిత్ షా వెంట యోగి ఆదిత్యనాధ్ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే హోంమంత్రి అమిత్ షా చార్మినార్ పర్యటన నేపథ్యంలో పాతబస్తీకి భారీగా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దింపారు. ఈరోజు సాయంత్రం నుంచే పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags :

Advertisement