Advertisement

ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమించిన అమిత్ మిశ్రా

By: chandrasekar Tue, 06 Oct 2020 5:43 PM

ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమించిన అమిత్ మిశ్రా


ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. గత శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మిశ్రా వేలికి గాయమైంది. దీంతో ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన మిశ్రా మైదానాన్ని వదిలాడు. ఆ మ్యాచ్‌లో మధ్య ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేసిన మిశ్రా గాయం కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

అమిత్ మిశ్రా ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అవుతాడని ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న అతడికి ప్రత్యామ్నాయాన్ని గుర్తించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

యూఏఈ పిచ్‌ల మీద మధ్య ఓవర్లలో బౌలింగ్ చేయడమే కాకుండా జట్టులోకి యంగ్‌స్టర్స్‌కు అతడి అనుభవం ఎంతో పనికొచ్చిందని సదరు అధికారి ఎన్ఏఐతో చెప్పారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసిన మిశ్రా 2 ఓవర్లలో 14 రన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ మిశ్రా గాయపడటం బాధించిందన్నాడు.

ఈ ఐపీఎల్‌లో అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 0/23, 2/35, 1/14 చొప్పున గణాంకాలను నమోదు చేశాడు. 150 మ్యాచ్‌ల్లో 160 వికెట్లు తీసిన మిశ్రా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. లసిత్ మలింగ ఐపీఎల్‌లో 170 వికెట్లు తీశాడు.

Tags :
|
|

Advertisement