Advertisement

  • కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి హైదరాబాద్‌కు చేరిన ప్రత్యేక బృందం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి హైదరాబాద్‌కు చేరిన ప్రత్యేక బృందం

By: chandrasekar Thu, 11 June 2020 5:02 PM

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి హైదరాబాద్‌కు చేరిన ప్రత్యేక బృందం


హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై ఆరా తీసేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు వచ్చింది. బుధ‌వారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాల‌యంలో కేంద్ర బృందం స‌భ్యులు వికాస్ గాడే, డా.ర‌వీంద‌ర్‌ల‌తో క‌లిసి జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ డీ.ఎస్‌.లోకేష్ కుమార్‌, హైద‌రాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత‌మ‌హంతి, జీహెచ్‌ఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ బి.సంతోష్‌, సీసీపీ దేవేంద‌ర్‌రెడ్డి, కరోనా కంట్రోల్ రూం ఓఎస్‌డీ అనురాధ‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రజల స‌హ‌కారం చాలా కీల‌క‌మ‌ని అన్నారు.

జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో జోన్లు, స‌ర్కిళ్లు, వార్డులవారిగా నెల‌కొన్న ప‌రిస్థితి గురించి ఆరా తీశారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌కు దాదాపు పూర్తిగా మిన‌హాయింపులు ఇచ్చార‌ని, ఇదే జోరులో కేసుల సంఖ్య న‌మోదైతే జులై 31 కల్లా ప‌రిస్థితి తీవ్రంగా మారుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఢిల్లీ, ముంబయి, చెన్నైల‌లో ప్రైవేట్ ఆసుప‌త్రులు, ల్యాబ్‌ల‌లో కూడా కరోనా ప‌రీక్షలు నిర్వహిస్తున్నందున, ప్రైవేటుగా నిర్వహించిన పరీక్షల్లోనే 70 శాతం పైబ‌డి పాజిటివ్ కేసులు వస్తున్నట్లుగా గుర్తు చేశారు.

కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి హోం కంటైన్‌మెంట్ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమని సంజ‌య్ జాజు తెలిపారు. రోజుకు 100 కేసుల‌కంటే ఎక్కువ‌గా నిర్థార‌ణ అవుతున్నందున జీహెచ్‌ఎంసీ ప‌రిధిలోనే నాలుగు జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లతో వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.

Tags :
|

Advertisement