Advertisement

  • నరేంద్ర మోడీకి లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు ప్రకటించిన అమెరికా

నరేంద్ర మోడీకి లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు ప్రకటించిన అమెరికా

By: Sankar Tue, 22 Dec 2020 11:19 AM

నరేంద్ర మోడీకి లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు ప్రకటించిన అమెరికా


డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్రమోదీని అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ప్రతిష్టాత్మక ‘లీజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును అందించింది.

ప్రధాని మోదీ తరఫున ఈ అవార్డును శ్వేతసౌధంలో స్వీకరించారు. యూఎస్ నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ రాబర్డ్ ఓబ్రియన్ దీన్ని తరణ్‌జిత్ సింగ్ సంధూకు అందజేశారు. అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడంలో మోదీ కృషి చేసినందుకు ప్రధాని మోదీకి అవార్డును అందజేసినట్లు ఓ బ్రియన్ ట్విట్టర్‌లో తెలిపారు.

మీ నాయకత్వానికి ఇది గుర్తింపు అని ట్రంప్ అన్నట్టు రాబర్ట్ ట్వీట్ చేశారు. అలాగే ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు ఈ పురస్కారాలు లభించాయి. ఆయా దేశాల రాయబారులు వీటిని అందుకున్నారు

Tags :

Advertisement