Advertisement

అంబులెన్సు బోల్తా ..డ్రైవర్ కు స్వల్ప గాయాలు

By: Sankar Wed, 12 Aug 2020 3:41 PM

అంబులెన్సు బోల్తా ..డ్రైవర్ కు స్వల్ప గాయాలు



ప్రమాదం సమయంలో అండగా నిలిచి గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్‌కు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం జలంత్ర కోట జంక్షన్ వద్ద జాతీయరహదారిపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. లారీని అధికమించే క్రమంలో అడుపుతప్పిన అంబులెన్స్ బోల్తా పడి పక్కనే ఉన్న వరద కాలువలో పడిపోయింది.

అయితే ఆ సమయంలో డ్రైవర్ మినహా ఎవ్వరూ అంబులెన్స్‌లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిన్నపాటి గాయాలతో బయటపడ్డ డ్రైవర్ ను గమనించిన కొందరు స్థానికులు మెరుగైన చికిత్స కోసం బరంపురం ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గురైన వారిని రక్షించడానికి వెళ్తుండగా అంబులెన్స్ కూడా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు నేపథ్యంలో ఇటీవలే సీఎం జగన్ అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్స్‌ వాహనాల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Tags :
|
|

Advertisement