అక్టోబర్ 17 నుంచి అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్
By: Sankar Tue, 06 Oct 2020 3:34 PM
ప్రముఖ ఈ -కామర్స్ సంస్థలు పండుగ సందడి ముందే మొదలు పెట్టేశాయి. కరోనా నేపథ్యంలో వినియోగదారులు ఆఫ్ లైన్ షాపింగ్ కంటే.. ఆన్ లైన్ షాపింగ్ కే మొగ్గు చూపుతున్నారు. దీంతో తమ కస్టమర్లకు పండుగ సందర్భంగా సరి కొత్త ఆఫర్లను ఆందిస్తున్నాయి.
దసరా, దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ "గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్"ను ప్రకటించింది. అక్టోబరు 17వ తేదీన ఈ ప్రత్యేక సేల్ ప్రారంభం కానుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా అమెజాన్లో వస్తువులు కొనుగోలు చేసేవారు హెచ్డీఎఫ్సీ డెబిట్,క్రెడిట్ కార్డును ఉపయోగించి 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ను పొందవచ్చు.
షరతులకు లోబడి ఈఎంఐలపై కూడా ఇది వర్తిస్తుంది. ప్రైమ్ మెంబర్షిప్ కలిగిన వారు 24గంటల ముందు నుంచే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా అక్టోబరు 14న విడుదల చేసే వన్ప్లస్ 8టీ 5జీ ఫోన్, అక్టోబరు 15న తీసుకురానున్న అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లైట్లను ఈ గ్రేట్ ఇండియన్ సేల్లో అమ్మకానికి తీసుకురానున్నారు. వీటితో మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, నిత్యావసర సరకులు, దుస్తులు, పుస్తకాలు, పిల్లల బొమ్మలపై కూడా రాయితీలు లభించనున్నాయి.