Advertisement

  • అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తి ..భారీ బహిరంగ సభ ఏర్పాటు

అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తి ..భారీ బహిరంగ సభ ఏర్పాటు

By: Sankar Thu, 17 Dec 2020 11:36 AM

అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తి ..భారీ బహిరంగ సభ ఏర్పాటు


అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తిఅయింది ..సరిగ్గా గత ఏడాది ఇదే రోజు ఏపీ శాసన సభలో సీఎం జగన్ మూడు రాజధానుల అంశం తీసుకొచ్చారు...

మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడంతో ఆరోజున తుళ్లూరు, వెలగపూడి, మందడం, రాయపూడి తదితర గ్రామాల్లో రైతులు రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని చెప్పి ఆరోజు నుంచి రైతులు ఉద్యమం చేయడం మొదలుపెట్టారు...

ఈ సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు 30 వేలమందికి పైగా రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నది. అమరావతికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. అటు బీజేపీ కూడా అమరావతికి జైకొట్టింది. జనసేన పార్టీ కూడా మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా అమరావతికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :
|

Advertisement