Advertisement

  • అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా కీలక ప్రకటన చేసిన అల్లు ఫ్యామిలీ

అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా కీలక ప్రకటన చేసిన అల్లు ఫ్యామిలీ

By: Sankar Thu, 01 Oct 2020 3:22 PM

అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా కీలక ప్రకటన చేసిన అల్లు ఫ్యామిలీ


తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజ హాస్య నటులలో ఒకరు స్వర్గీయ అల్లు రామలింగయ్య ..నేడు అయన జయంతి...ఆయన జయంతి సందర్భముగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు సినీప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. 1952లో ప్రముఖ సినీ దర్శకుడు రాజారావు నిర్మించిన పుట్టిల్లు సినిమాలో రామలింగయ్య తొలిసారిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో పురోహితుడు పాత్రతో ఆయన మెప్పించారు.

రామలింగయ్య వెయ్యికి పైగా చిత్రాలను పూర్తి చేయడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. సుమారు 1200 సినిమాల్లో నటించిన రామ లింగయ్యకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. నేడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయనకు కుటుంబసభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో ఓ కీలక ప్రకటన చేశారు .

అల్లు రామలింగయ్య పేరు మీద స్టూడియోను నిర్మించాలని సంకల్పించారు. గండిపేటలో 10 ఎకరాలలో అల్లు స్టూడియోస్ పేరుతో స్టూడియోను సన్నాహాలు చేస్తున్నట్టు అల్లు అరవింద్ తోపాటు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ప్రకటించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఫిల్మ్ మేకింగ్ కు అనుకూలంగా ఉండేలా ఆర్ట్ ఫిలిం స్డూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు.

Tags :

Advertisement