Advertisement

ఎన్‌కౌంట‌ర్‌లో మొత్తం ఉగ్ర‌వాదులు హ‌తం...

By: chandrasekar Thu, 08 Oct 2020 5:43 PM

ఎన్‌కౌంట‌ర్‌లో మొత్తం ఉగ్ర‌వాదులు హ‌తం...


జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం సోఫియాన్ జిల్లా షుగాన్‌లో ఉగ్ర‌వాదుల‌కు, భ‌ద్ర‌తాబ‌ల‌గాల మ‌ధ్య జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ ముగిసింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మొత్తం ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. వారి నుంచి ఒక ఏకే రైఫిల్‌, రెండు పిస్తోల్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

సోఫియాన్ జిల్లా షుగాన్‌లో మంగ‌ళ‌వారం అర్ధరాత్రి నుంచి భ‌ద్ర‌తాబ‌ల‌గాలు, ఉగ్ర‌వాదులకు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ప‌క్కా స‌మాచారంతో ప‌ట్టుకునేందుకు వెళ్లిన భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రుప‌డంతో ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం వారు ఎదురు కాల్పులు జ‌రిపారు.

కాగా, ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మొత్తం ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టామ‌ని ఇండియ‌న్ ఆర్మీ నార్త‌ర్న్ క‌మాండ్ ప్ర‌క‌టించింది. ఇక క‌శ్మీర్ జోన్ పోలీసులు కూడా ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

Tags :
|

Advertisement