సుప్రీం కోర్టులో సోమవారం నుంచి అన్ని బెంచ్లు అందుబాటులోకి..
By: chandrasekar Mon, 12 Oct 2020 10:39 AM
సుప్రీం కోర్టులో సోమవారం
నుంచి అన్ని బెంచ్లు అందుబాటులోకి రానున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 30 మంది
న్యాయమూర్తులతో కూడిన 12 బెంచ్లు నిత్యం
కేసులను విచారించనున్నాయి. కరోనా
మహమ్మారి కారణంగా కొద్దిరోజులుగా ప్రతి రోజూ 20 కేసులను విచారించడానికి వేర్వేరుగా ఇద్దరు, ముగ్గురు
న్యాయమూర్తులతో కూడిన ఐదు బెంచ్లు పని చేస్తున్నాయి.
సోమవారం నుంచి ప్రతి రోజు
ద్విసభ్య, తిసభ్య
న్యాయమూర్తుల బెంచ్లు పది, ఇద్దరు సింగిల్ జడ్జిలతో కూడిన బెంచ్లు అందుబాటులో
ఉంటాయని సుప్రీం కోర్టు వెబ్సైట్ పేర్కొంది.
దేశంలో కరోనా మహమ్మారి కారణంగా భౌతిక విచారణలు ప్రారంభించకూడదని
నిర్ణయించింది. కరోనా ప్రేరేపిత లాక్డౌన్ మార్చి 23 నుంచి ఉన్నత న్యాయస్థానం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ జరుగుతోంది.
సోమవారం ఎనిమిది బెంచ్లకు
ముగ్గురు న్యాయమూర్తులు, మరో రెండు ద్విసభ్య, రెండు సింగిల్ జడ్జి
బెంచ్ల న్యాయమూర్తులను వాదలు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విననున్నారు. బదిలీ
పిటిషన్లను వినడానికి, నిర్ణయించడానికి రెండు సింగిల్ జడ్జిల బెంచీలు
ఉండనున్నాయి.