నివర్ తుఫాన్ కారణంగా తిరుమలలో అలర్ట్...,నడక మార్గం మూసివేత
By: chandrasekar Fri, 27 Nov 2020 10:19 AM
చిత్తూరు జిల్లాలో నివర్
తుఫాన్ బీభత్సం సృష్టించింది. బుధ, గురువారం
కురిసిన భారీ వర్షాలకు వణికిపోయింది.
వాగులు వంకలు పొంగి పొర్లగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇటు తిరుమలపైనా భారీ వర్షాల ప్రభావం కనిపించింది.
గురువారం ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. వీధులన్నీ జలమయం అయ్యాయి. దీంతో
భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇటు ఘాట్ రోడ్డులో కూడా చెట్లు, బండరాళ్లు
విరిగిపడగా టీటీడీ సిబ్బంది తొలగించింది.
ఈ భారీ వర్షాల కారణంగా
శ్రీవారి మెట్టు మార్గం తాత్కాలికంగా మూసివేశారు. నివర్ తుపాన్ ప్రభావంతో
కురుస్తున్న వర్షాలకు శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు విరిగిపడుతున్నాయి.
దీంతో భక్తులకు ప్రమాదం పొంచి ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా శ్రీవారి మెట్టు
నడకదారిని టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తులను అనుమతించే విషయాన్ని తిరిగి
తెలియజేస్తామని నదించి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. భారీ
వర్షాలతో తిరుమలలో జలాశయాలు నీటితో నిండాయి. పాప వినాశనం, ఆకాశ
గంగ, గొగర్బం, కేపీ
డ్యామ్ గేట్లు అధికారులు ఎత్తివేశారు.