Advertisement

కుటుంబాన్నీ బలి తీసుకున్న మద్యం వ్యసనం

By: chandrasekar Tue, 21 July 2020 12:54 PM

కుటుంబాన్నీ  బలి తీసుకున్న మద్యం వ్యసనం


ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా శ్రీ రంగరాజపురం మండలం చియ్యురులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో సుధాకర్ (32), సింధు ప్రియ (22) భార్యాభర్తలకు మధు ప్రియ (7), శ్రీలత (5) సంతానం. అయితే సుధాకర్ ప్రతి రోజూ మ‌ద్యం తాగి ఇంటికొచ్చి భార్యతో గొడ‌వ‌ప‌డేవాడు.

ఈ నేప‌థ్యంలో సోమ‌వారం భార్యాభర్తలిద్దరికీ తీవ్ర ఘ‌ర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవ కాస్తా చినికిచినికి తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి చెందిన భార్య సింధు త‌న ఇద్దరు కుమార్తెలు మధు ప్రియ, శ్రీలతలతో కలిసి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషయం తెలుసుకున్న సుధాక‌ర్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహ‌త్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబంలోని న‌లుగురు ఆత్మహ‌త్య చేస‌కొని చ‌నిపోవ‌డంతో గ్రామంలో తీవ్ర విషాదం నెల‌కొంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసు‌కున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.

Tags :
|

Advertisement