కుటుంబాన్నీ బలి తీసుకున్న మద్యం వ్యసనం
By: chandrasekar Tue, 21 July 2020 12:54 PM
ఒకే కుటుంబంలో ఇద్దరు
పిల్లలను బావిలోకి తోసేసి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా
శ్రీ రంగరాజపురం మండలం చియ్యురులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో సుధాకర్ (32), సింధు
ప్రియ (22) భార్యాభర్తలకు
మధు ప్రియ (7), శ్రీలత (5) సంతానం. అయితే సుధాకర్ ప్రతి రోజూ మద్యం తాగి
ఇంటికొచ్చి భార్యతో గొడవపడేవాడు.
ఈ నేపథ్యంలో సోమవారం భార్యాభర్తలిద్దరికీ
తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవ కాస్తా చినికిచినికి తీవ్రస్థాయికి చేరుకుంది.
దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన భార్య సింధు తన ఇద్దరు కుమార్తెలు మధు ప్రియ, శ్రీలతలతో
కలిసి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ విషయం తెలుసుకున్న
సుధాకర్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసకొని చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం
నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.