Advertisement

  • అల్‌ఖైదా ఉగ్రవాది జుబెర్ అహ్మద్ హైదరాబాద్‌కు తరలించారు

అల్‌ఖైదా ఉగ్రవాది జుబెర్ అహ్మద్ హైదరాబాద్‌కు తరలించారు

By: chandrasekar Wed, 27 May 2020 2:38 PM

అల్‌ఖైదా ఉగ్రవాది జుబెర్ అహ్మద్ హైదరాబాద్‌కు తరలించారు


ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబెర్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అల్వాల్‌లోని తన నివాసానికి జుబెర్‌ను తీసుకువచ్చారు. 2016లో అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ అధికారులు జుబెర్‌ను అరెస్ట్‌ చేశారు. 16 రోజుల క్రితం అమెరికా అధికారులు ఆయన్ను ఇండియాకు పంపించారు. 14 రోజుల పాటు అమృత్‌సర్‌లోని క్వారంటైన్‌ కేంద్రంలో జుబెర్‌ను ఉంచారు. క్వారంటైన్‌ పూర్తి కావడంతో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇప్పటి వరకూ ఉగ్రవాది జుబెర్‌ అమెరికా జైలులో ఉన్నాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అమెరికాలోని పలు జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఏళ్ల నుంచి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను వదిలిపెట్టారు.

al qaeda,terrorist,zuber ahmad,evacuated,hyderabad ,అల్‌ఖైదా, ఉగ్రవాది, జుబెర్ అహ్మద్, హైదరాబాద్‌కు, తరలించారు


ఉగ్రవాది జుబెర్‌ను వదిలిపెట్టే క్రమంలో అమెరికా అధికారులు భారత విదేశాంగ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో జుబేర్ మహమ్మద్ ఇబ్రహీంను అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. కరోనా క్వారంటైన్ సెంటర్‌లో ఉంచి ఇప్పుడు హైదరాబాద్‌కు తరలించారు. షార్జాలో జన్మించిన జుబెర్ మహ్మద్ 1984లో హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తెలుస్తోంది. 2001లో ఉస్మానియా యూనివర్సిటీలోనే బీటెక్ చదివాడు. అనంతరం అమెరికా వెళ్లాడు. అక్కడి నుంచి అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చాడు. పలు ఉగ్రవాద కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జుబేర్ 2015లో అమెరికాలో పోలీసులకు చిక్కాడు. అక్కడి కోర్టులో జుబెర్‌పై ఉన్న అభియోగాలు నిజమేనని తేలడంతో అమెరికాలో శిక్ష అనుభవిస్తున్నాడు.

Tags :

Advertisement