Advertisement

  • రైనా రిటైర్మెంట్ పై ఆలోచించు ..నీది రిటైర్మెంట్ వయస్సు కాదు ..ఆకాష్ చోప్రా

రైనా రిటైర్మెంట్ పై ఆలోచించు ..నీది రిటైర్మెంట్ వయస్సు కాదు ..ఆకాష్ చోప్రా

By: Sankar Fri, 21 Aug 2020 1:59 PM

రైనా రిటైర్మెంట్ పై ఆలోచించు ..నీది రిటైర్మెంట్ వయస్సు కాదు ..ఆకాష్ చోప్రా


టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సీనియర్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు నిమిషాల వ్యవధిలో వీడ్కోలు పలికి క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశారు. వీరిద్దరు ఆటకు గుడ్‌బై చెప్పి ఐదు రోజులు కావొస్తున్నా.. ఇప్పటికీ ఏదో ఒక చోట ఇదే విషయం గురించి చర్చ జరగుతూనే ఉంది. రైనా వీడ్కోలుపై మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా గురువారం స్పందించిన విషయం తెలిసిందే.

రైనా లాంటి ఆటగాడు 33 ఏళ్లకే వీడ్కోలు పలకడం సరికాదని, అదసలు రిటైర్మెంట్‌ వయసే కాదన్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో రైనాను ఏ స్థానంలో పంపించినా జట్టుకు విజయాలే అందించాడని, అయితే అతడికి సరైన అవకాశాలు రాలేదని ఆకాశ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆకాశ్‌ చోప్రా మరోసారి రైనా గురించి తన యూట్యూబ్‌ చానెల్‌లో ఆసక్తిగా స్పందించాడు.

రైనా నీ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించు.. రిటైర్మెంట్‌ విషయంలో పాక్‌ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రదిని అనుసరించు..రిటైర్మెంట్‌ విషయంలో అతను ఎన్నోసార్లు యూ-టర్న్‌ తీసుకున్నాడు. నువ్వు కూడా ఆఫ్రిదిలా యూ టర్న్‌ తీసుకుంటే బాగుండు' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. కాగా ధోని, రైనాల రిటైర్మెంట్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరువురు ఆటగాళ్లకు లేఖ ద్వారా తన సందేశాన్ని పంపిన సంగతి తెలిసిందే. మీ ప్రతిభతో దేశానికి ఎంతో సేవ చేశారు.. మీ సేవలను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు అంటూ మోదీ లేఖలో పేర్కొన్నారు

Tags :
|

Advertisement