Advertisement

  • బహుశా ఆఫ్రిది ఇండియా రికార్డులు మర్చిపోయిఉంటాడు ..ఆకాష్ చోప్రా

బహుశా ఆఫ్రిది ఇండియా రికార్డులు మర్చిపోయిఉంటాడు ..ఆకాష్ చోప్రా

By: Sankar Tue, 07 July 2020 11:09 AM

బహుశా ఆఫ్రిది ఇండియా రికార్డులు మర్చిపోయిఉంటాడు ..ఆకాష్ చోప్రా



షాహిద్ ఆఫ్రిది ..ఇలా కరోనా నుంచి కోలుకున్నాడో లేదో ఆలా వెంటనే టీమిండియా మీద నోరుపారేసుకోవడం ప్రారంభించాడు ..ఇది ఆఫ్రిది కి కొత్త కాకపోయినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా ఇలా చేయడం అవసరమా అని అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ..ఆఫ్రిది కరోనా బారిన పడితే కోలుకోవాలని అనుకున్న వారిలో ఇండియన్స్ కూడా ఉన్నారు ..మరి అలాంటిది ఆఫ్రిది ఇలా నోరుపారేసుకోవడం సరైనది కాదు అని అంటున్నారు ..ఆఫ్రిది ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భారత్‌పై మ్యాచ్‌లు ఆడటాన్ని పాకిస్థాన్ టీమ్ బాగా ఎంజాయ్ చేస్తుంది. చాలా సార్లు టీమిండియాని మేము చిత్తుగా ఓడించాం. ఎంతలా అంటే..? వారిపై మేము చూపిన ఆధిపత్యానికి ఒకానొక దశలో మ్యాచ్ తర్వాత .. మాపై దయ చూపమని భారత క్రికెటర్లు కోరేవారు’’ అని వెల్లడించాడు.

షాహిద్ అఫ్రిదీ వ్యాఖ్యలపై తాజాగా భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ‘‘భారత్, పాకిస్థాన్ మధ్య వరల్డ్‌కప్ రికార్డ్‌లను ఓసారి పరిశీలిస్తే..? ఆధిపత్యం ఎవరిదో స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా అఫ్రిది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ గెలుపుని మనసులో పెట్టుకుని మాట్లాడాడేమో..? కానీ.. అదే టోర్నీలో పాకిస్థాన్‌ని భారత్ ఒకసారి ఓడించింది. టీమిండియా ఆధిపత్యం చాలా భిన్నంగా ఉంటుంది. అది ఎలాగంటే..? భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లి.. అక్కడ కంగారులను ఓడించింది. కానీ.. పాకిస్థాన్ ఆ గడ్డపైకి వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండు జట్ల మధ్య తేడా ఇదే’’ అని అఫ్రిదీకి చోప్రా చురకలేశాడు.

ప్రపంచకప్‌లలో ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు ఏడుసార్లు తలపడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే గెలుపొందింది. అయితే.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో పాకిస్థాన్‌ని ఓడించిన భారత్.. ఫైనల్లో ఆ జట్టు చేతిలోనే పరాజయాన్ని చవిచూసింది. కానీ.. 2019 వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ని 89 పరుగుల తేడాతో చిత్తు చేసిన.. టీమిండియా ఆ ఓటమికి బదులు తీర్చుకుంది.

Tags :
|

Advertisement