ఆ జట్టు వేలంలోనే సగం ఐపీయల్ గెలుస్తుంది ..ఆకాష్ చోప్రా
By: Sankar Sat, 01 Aug 2020 10:35 AM
ముంబై ఇండియన్స్ జట్టు సగం ఐపీఎల్ను వేలంపాటలోనే గెలిచేస్తుందని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పాడు. ఆ జట్టు యాజమాన్యం ప్రతి స్థానం కోసం ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటుందని అతను అన్నాడు. దీనివల్ల ఏ ఆటగాడైనా ఫామ్ కోల్పోయినా, లేక గాయాలపాలైనా వెంటనే మరో రిప్లేస్మెంట్ రెడీగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తుంది. అద్భుతమైన జట్టుతోపాటు ప్రతి ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడానికి మరొకరు సిద్ధంగా ఉండేలా చూస్తుంది. ఇలా అద్భుతమైన ఆటగాళ్లతో జట్టును రెడీ చేయడమంటే సగం ఐపీఎల్ను ఆక్షన్లోనే గెలిచేసినట్లు’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు..
ఇక ఐపీయల్ ప్రారంభం నుంచి సచిన్ , జయసూరియా , పాంటింగ్ , పొలాక్ , హర్భజన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉన్న టీం ముంబై ఇండియన్స్ ..అయితే ఐపీయల్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ జట్టు తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది ..కానీ హిట్ మాన్ రోహిత్ శర్మ ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడా ఇక అప్పటి నుంచి ఆ జట్టు దశ తిరిగింది ..రోహిత్ కెప్టెన్సీ లో నాలుగు సార్లు విజేతగా నిలిచి ఐపీయల్లో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా గా చరిత్ర సృష్టించింది..