Advertisement

  • ధావన్ కు టెస్ట్ జట్టులో చోటు కష్టమే ..ఆకాష్ చోప్రా

ధావన్ కు టెస్ట్ జట్టులో చోటు కష్టమే ..ఆకాష్ చోప్రా

By: Sankar Tue, 28 July 2020 8:54 PM

ధావన్ కు టెస్ట్ జట్టులో చోటు కష్టమే ..ఆకాష్ చోప్రా



టీమిండియా స్టార్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌కు టెస్టుల్లో ఓపెనింగ్‌ చేసే అవకాశం భవిష్యత్తులో కష్టమేనంటూ భారత మాజీ టెస్టు ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే రోహిత్‌ శర్మ నుంచి మొదలుకొని కేఎల్‌ రాహుల్‌, పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి, మురళి విజయ్‌ వంటి ఆటగాళ్లను ఓపెనింగ్‌ స్థానంలో పరిక్షించింది. వీరిలో ప్రతీ ఒక్కరు ఏదో ఒక మ్యాచ్‌లో ఆకట్టుకున్నారే తప్ప ప్రతీ మ్యాచ్‌లో బాగా ఆడిన సందర్భాలు తక్కువే ఉన్నాయి.. వయసు రిత్యా చూస్తే మాత్రం ధవన్‌కు తక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆకాశ్‌ పేర్కొన్నాడు..

34 ఏళ్ల వయసు ఉన్న శిఖర్‌ ధావన్‌ మళ్లీ టెస్టు క్రికెట్‌ ఆడే అవకాశం ఉందా అంటూ నెటిజన్లు​ అడిగిన ప్రశ్నకు ఆకాశ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా సమాధానమిచ్చాడు. ' అవకాశం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు. అయితే ఆ అవకాశం తొందరగా రావొచ్చు.. రాకపోవచ్చు.

కానీ ధావన్‌ మళ్లీ టెస్టులు ఆడే అవకాశం ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే జట్టు మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే టెస్టు ఓపెనర్‌గా పలువురు ఆటగాళ్లను పరిక్షించింది. ధావన్‌ విఫలమైన తర్వాత రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్లుగా తమను తాము నిరూపించుకున్నారు. దీనిబట్టి చూస్తే ప్రస్తుతం అతను ఓపెనింగ్‌ అవకాశాల్లో 5వ స్థానంలో ఉన్నాడు

Tags :

Advertisement