Advertisement

  • సెంచరీ తో చెలరేగిన కెప్టెన్ రహానే ...82 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

సెంచరీ తో చెలరేగిన కెప్టెన్ రహానే ...82 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

By: Sankar Sun, 27 Dec 2020 12:54 PM

సెంచరీ తో చెలరేగిన కెప్టెన్ రహానే ...82 పరుగుల ఆధిక్యంలో టీమిండియా


ఫామ్ లో లేదని విమర్శలు ఒకవైపు , కోహ్లీ లేకపోవడంతో కెప్టెన్సీ భారం ఇంకోవైపు , అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఓటమి మరోవైపు ఇన్ని అడ్డంకుల మధ్య టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్ రహానే అద్భుత సెంచరీ తో చెలరేగాడు...విదేశాలలో తనను ఎందుకు విలువైన ఆటగాడు అంటారో మరొకసారి నిరూపించుకున్నాడు...

195 బంతులాడి 11 ఫోర్ల సాయంతో 100 పరుగులు సాధించిన రహానే తన టెస్టు కెరీర్‌లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రహానే 104, జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు...

ఇక ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్ చేతిలో ఇంకా అయిదు వికెట్లు ఉన్నాయి...రహానే , జడేజాతో పాటుగా అశ్విన్ కూడా బ్యాటింగ్ చేయగలడు ..దీనితో రేపు టీమిండియా మరింత ఆధిక్యం సాధిస్తే రెండో టెస్ట్ లో గెలిచే అవకాశంఉంది..

Tags :
|
|
|

Advertisement