రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మార్పు .. అజయ్ మాకెన్ కు కొత్తగా బాధ్యతలు
By: Sankar Mon, 17 Aug 2020 08:52 AM
రాజస్థాన్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం సమసిపోవటంతో ఇక రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దేపనిని అధిష్ఠానం మొదలుపెట్టింది. రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా అవినాశ్పాండే స్థానంలో అజయ్మాకెన్ను నియమించింది.
సీఎం అశోక్గెహ్లాట్, యువనేత సచిన్పైలట్ వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముగ్గురు సభ్యుల కమిటీని ఆదివారం ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో అజయ్మాకెన్తోపాటు అహ్మద్పటేల్, కేసీ వేణుగోపాల్ సభ్యులుగా ఉన్నారు.
కాగా సచిన్ పైలెట్ వర్గం తిరుగుబాటు చేసిన సమయంలో మాకెన్ పరిశీలకుడిగా రాజస్తాన్కు వెళ్లి కీలకపాత్ర పోషించారు. రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం పైలెట్ వర్గం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడంతో రాజస్తాన్ అసెంబ్లీలో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని నెగ్గిన విషయం తెలిసిందే..