సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసులో కీలక మలుపు ..ప్రియుడు అజయ్ అరెస్ట్
By: Sankar Tue, 13 Oct 2020 9:38 PM
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ప్రేమించిన వాడే మోస్తం చేస్తే తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
ప్రియుడు అజయ్ వేధింపుల వలన శ్వేత చనిపోయింది. ఇళ్ళల్లో ఒప్పించి త్వరలోనే వివాహం చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. కానీ అంతలోనే అజయ్ మనసు మారింది. అమ్మాయిని వివిధ రకాల వేధించడం మొదలు పెట్టాడు. అజయ్ ఓ మోసగాడని శ్వేత గుర్తించింది. అది తట్టుకోలేకపోయింది. అతడిని దూరంగా పెట్టేందుకు ప్రయత్నించింది. ఇది తెలుసుకొని అజయ్లోని రాక్షసులు బయటకు వచ్చాడు.
శ్వేతతో కలిసి ఉన్నప్పుడు వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంస్టాగ్రామ్ తో పాటు ఫేస్బుక్లో ఫోటోలను పోస్ట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందాడు. తన ఫోటోలను డిలీట్ చేయాలంటూ శ్వేత బతిమాలింది. అయినా వినక పోవడంతో ప్రాణాలు అర్పించింది.
ఇక ఈ కేసులో నిందితుడు అజయ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. శ్వేత మరణానికి అజయ్ కారణమని తేల్చారు. ఆమె ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుందన్నారు పోలీసులు. సోషల్ మీడియాలో ఫొటోలను డిలీట్ చేయకుండా అజయ్ వేధింపులు గురిచేశాడన్నారు పోలీసులు. నిందితుడి అరెస్ట్ చేసి.. రిమాండ్కు తరలించారు.