ఎంపీ మల్లారెడ్డి ని వెంటనే సస్పెండ్ చేయాలి... లేకుంటే మాత్రం...!
By: Anji Sat, 26 Dec 2020 5:25 PM
ఎక్కువ గ్రేడ్ కోసం నకిలీ సర్టిఫికెట్ సృష్టించిన చామకూర మల్లారెడ్డినీ తెలంగాణ మంత్రిమండలి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ కమిటి అధ్వర్యంలో నారాయణ గూడ దగ్గర ఆందోళన నిర్వహించి చామకూర మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.
సదర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎన్ శంకర్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి గ్యార నరేష్ మాట్లాడుతూ…. విద్య వ్యాపారం చేస్తూ అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్న మల్లారెడ్డి మరొకసారి నాక్ గ్రేడింగ్ కోసం అక్రమ మార్గాలను ఎంచుకొని అడ్డంగా దొరికిపోయాడు.
మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజి మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో అన్నీ అక్రమ మార్గాన్నే న్యాకు గ్రేడ్, యూజీసీ స్వయంప్రతిపత్తి పొందుతున్నారని వారు గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అవినీతికి పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకుంటారు అని గతంలో కేసీఆర్ ప్రకటించారు.అవినీతి ఆరోపణలపై గతంలో దళితుడైన అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజన్నను క్షణాల లో రాజన్నను ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించడం జరిగింది.
జాతీయ స్థాయిలో అత్యంత ప్రామాణికమైన న్యాకు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యం నకిలీ ధృవ పత్రాలు సమర్పించింది ధృవీకరించిన నేపథ్యంలో మల్లారెడ్డి ని వెంటనే సస్పెండ్ చేయాలని కేసిఆర్ కు హెచ్చరిస్తున్నా.
మల్లారెడ్డి పై కేసీఆర్ చర్యలు తీసుకోకపోతే మల్లారెడ్డి అక్రమ ఆస్తులు లో కెసిఆర్ కు వాటా ఉంది అని మేము నమ్మాల్సి వస్తుందని వారు అన్నారు. ఆ రెడ్డి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల కూడా రద్దు చేయాలని, మల్లారెడ్డి ఆస్తులపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి కాంపళ్లి శ్రీనివాస్. హైద్రాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ , నాయకులు చైతన్య, సత్య, హరీష్ ఆజాద్, కిషోర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు….!