Advertisement

విమాన సర్వీసుల పునరుద్ధరణ: మే 25

By: chandrasekar Thu, 21 May 2020 2:26 PM

విమాన సర్వీసుల పునరుద్ధరణ: మే 25


పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మే 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు క్రమంగా పున:ప్రారంభమవుతాయని వెల్లడించారు. కరోనావైరస్‌ను నియంత్రించటానికి తొలుత మార్చి 25న లాక్‌డౌన్ విధించినప్పటి నుంచీ దేశంలో అన్ని రవాణా సదుపాయాలతో పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు.

airline,service,starts,india,domestic ,విమాన సర్వీసు, పునరుద్ధరణ, పౌర విమానయాన, హర్దీప్ సింగ్ పూరి, రవాణా


నాలుగో విడత లాక్‌డౌన్‌లో మే 18వ తేదీ నుంచి అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ విమాన సర్వీసులు మొదలు కాలేదు. ఈ సర్వీసులను మే 25వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ట్విటర్‌లో తెలిపారు. సర్వీసులను పున:ప్రారంభించటానికి సంసిద్ధం కావాలంటూ దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు సమాచారం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల కదలికలకు సంబంధించి ప్రామాణిక నిర్వహణా పద్ధతులు (ఎస్ఓపీల) వేరుగా జారీ చేస్తామన్నార.

Tags :
|
|

Advertisement