- హోమ్›
- వార్తలు›
- ఎయిర్పోర్టులో లిక్విడ్ గోల్డ్ స్మగ్లర్ల అరెస్టు...1678.50 గ్రాముల బంగారం స్వాధీనం..!
ఎయిర్పోర్టులో లిక్విడ్ గోల్డ్ స్మగ్లర్ల అరెస్టు...1678.50 గ్రాముల బంగారం స్వాధీనం..!
By: Anji Sat, 14 Nov 2020 1:53 PM
బంగారం దొంగలకు కన్నూర్ ఎయిర్ పోర్టు అడ్డగా మారుతోంది. గోల్డ్ను అక్రమ మార్గంలో తరలించేందుకు ఈ విమానాశ్రయం కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు.
వారి ప్రయత్నాలను కస్టమ్స్ అధికారులు పట్టేస్తున్నారు. తాజాగా లిక్విడ్ గోల్డ్ను తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్నారు.
కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో దొంగ బంగారం పట్టుబడింది. ఎయిర్పోర్టులోని ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1678.50 గ్రాముల బంగారం మిశ్రయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రయాణికుడు బంగారం మిశ్రమాన్ని ఒక పాలీథిన్ కవర్లో నింపి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.