Advertisement

  • నెల్లూరు జిల్లా పెదపాలెం సముద్రతీరంలో మిస్సైల్ శకలం

నెల్లూరు జిల్లా పెదపాలెం సముద్రతీరంలో మిస్సైల్ శకలం

By: Sankar Mon, 07 Dec 2020 09:57 AM

నెల్లూరు జిల్లా పెదపాలెం సముద్రతీరంలో  మిస్సైల్ శకలం


నెల్లూరు జిల్లాలో మిస్సైల్ కలకలంరేపింది. పెదపాళెం సముద్ర తీరంలో మిస్సైల్ శకలం కనిపించడంతో స్థానికులు అవాక్కయ్యారు. వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఏం జరిగిందని ఆరా తీశారు..

ఇస్కపల్లి మెరైన్‌ సీఐ పెంచలరెడ్డి, ఎస్‌ఐలు రసూల్‌ సాహెబ్, మహేంద్రలు శకలాలను పరిశీలించారు. ఆ శకలం జెట్‌ విమాన శకలం కాదని, ఎయిర్‌ఫోర్స్‌ మిస్సైల్‌ అని మెరైన్‌ నిర్థారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ మిస్సైల్ శకలం గుంటూరు జిల్లా సూర్యలంక తీరం నుంచి గతంలో ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ప్రయోగించిన మిస్సైల్‌ అని మెరైన్ పోలీసులు తేల్చారు. దీన్ని సముద్రంపై ఎంత ఎత్తులో గాలి ఉంటుందో తెలుసుకునేందుకు ఉపయోగిస్తారని తెలిపారు. ఇలాంటివి మూడు ప్రయోగించగా.. ఇప్పటికి 2 లభించాయని.. తాజాగా విడవలూరు మండల తీర ప్రాంతంలో మరొకటి బయటపడిందన్నారు.

Tags :
|

Advertisement