సీఎం అభ్యర్థిగా మళ్ళీ అతడినే ప్రకటించిన అన్నాడిఏంకె
By: Sankar Wed, 07 Oct 2020 10:49 AM
అన్నాడీఎంకె హైడ్రామాకు తెరపడింది. పార్టీ కార్యవర్గ సమావేశం ముందు వరకు ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వానికి పోటీపడ్డ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం...అనూహ్యంగా వెనక్కి తగ్గారు.
సమావేశం ప్రారంభమైన కాసేపటికే రానున్న ఎన్నికల్లో అన్నా డీఎంకే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ. ఈ మేరకు మరోసారి సీఎం అభ్యర్థిగా పళనిస్వామినే ప్రకటించింది స్టీరింగ్ కమిటీ. మొత్తం 11 మందితో ఏర్పాటైన స్టీరింగ్ కమిటీలో స్టీరింగ్ కమిటీలో 6 మంది పళనిస్వామికి మద్దతు తెలుపగా...5 మంది పన్నీర్ సెల్వంకు మద్దతునిచ్చారు.
అనంతరం పన్నీర్ సెల్వంకు పార్టీ వ్యవహారాల బాధ్యతలు కట్టబెట్టారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై వారిద్దరు సంతకాలు చేశారు. సమావేశంలో ఇద్దరు నేతలు ఒకరినొకరు సన్మానించుకున్నారు. ఈ పరిణామాలతో కొన్నాళ్లుగా...అన్నాడీఎంకెలో కొనసాగుతున్న సంక్షోభం ముగిసిపోయింది.