Advertisement

  • ఏప్రిల్ లోనే ఎన్నికలు నిర్వహించండి ..ఈసీ ని కోరిన ఏఐఏడీఎంకే

ఏప్రిల్ లోనే ఎన్నికలు నిర్వహించండి ..ఈసీ ని కోరిన ఏఐఏడీఎంకే

By: Sankar Mon, 21 Dec 2020 9:24 PM

ఏప్రిల్ లోనే ఎన్నికలు నిర్వహించండి ..ఈసీ ని కోరిన  ఏఐఏడీఎంకే


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఏఐఏడీఎంకే విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్‌ మూడు, నాలుగో వారాల్లో ఎన్నికలు జరిపేలా చూడాలంటూ ఆ మేరకు ఈసీకి వినతిపత్రం సమర్పించారు.

తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలను ఒకే దశలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతోపాటు పలు ఇతర పార్టీలు ఈసీని కోరాయి. వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు ఐసీఐ సెక్రటరీ జనరల్‌ ఉమేశ్‌ సిన్హా నేతృత్వంలోని ఈసీ బృందం రెండు రోజులపాటు చెన్నైలో పర్యటిస్తున్నది.

తమిళనాడు అసెంబ్లీ పదవీకాలం మే 24 తో ముగియనున్నది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.ఓటర్లు తీవ్ర వేసవి తాపానికి గురికాకుండా ఉండేలా ఏప్రిల్ మూడు లేదా నాలుగో వారానికి పోలింగ్‌ను ముందుకు తీసుకురావాలని ఈసీని తమ పార్టీ అభ్యర్థించినట్లు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఏఐఏడీఎంకే ఎన్నికల విభాగం కార్యదర్శి పొల్లాచి వీ జయరామన్ తెలిపారు..

Tags :
|
|
|

Advertisement