కాంగ్రెస్ దిగ్గజం, సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతి...
By: chandrasekar Wed, 25 Nov 2020 10:45 AM
కాంగ్రెస్ దిగ్గజం, సీనియర్
నేత, రాజ్యసభ
సభ్యుడైన అహ్మద్ పటేల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం
ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ( 71 ) కరోనా
వైరస్ తో బాధపడుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించారు. అహ్మద్ పటేల్ ఇక లేరనే వార్త
కాంగ్రెస్ పార్టీని శోకసముద్రంలో ముంచేసింది. గాంధీ కుటుంబానికి అత్యంత
విశ్వాసపాత్రుడిగా, ట్రబుల్ షూటర్ గా పేరున్న అహ్మద్ పటేల్ మరణించడం
పార్టీకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. కరోనా కారణంగా శరీరంలోని అవయవాలు
పాడవడంతో అహ్మద్ పటేల్ మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు.
అహ్మద్ పటేల్ మృతిపై
ప్రధాని నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు సహా కాంగ్రెస్ ప్రముఖులు
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్
ద్వారా తమ సంతాపం ప్రకటించారు. అహ్మద్ పటేల్ లేని లోటు తీర్చలేనిదని అన్నారు.
అహ్మద్ పటేల్ ఎక్కువకాలం ప్రజాజీవితంలో ఉన్నారని ఆయన మరణం విచారకరమని ప్రధాని మోదీ
ట్వీట్ చేశారు. కుమారుడు ఫైసల్ తో మాట్లాడానన్నారు.