Advertisement

  • ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్ ప్రక్రియ ప్రారంభం...!

ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్ ప్రక్రియ ప్రారంభం...!

By: Anji Sun, 15 Nov 2020 5:22 PM

ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్ ప్రక్రియ ప్రారంభం...!

ఈ నెల 23 నుంచి రాష్ర్టంలో వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే ధరణి పోర్టల్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్‌ను ప్రారంభిస్తార‌ని తెలిపారు.

వ్యవ‌సాయేత‌ర భూముల రిజిస్ర్టేష‌న్‌కు సంబంధించి ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సంబంధిత‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతోందని అన్నారు. వారి నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నద‌ని తెలిపారు

ధరణి పోర్టల్‌పై క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. తొలుత వచ్చిన చిన్న చిన్న స‌మ‌స్యల‌ను ధరణి పోర్టల్ అధిగమించిన‌ట్లు చెప్పారు. మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరు శాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నట్లు వెల్లడించారు.

అన్ని సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాకనే వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నట్లు సీఎం తెలిపారు. అందుకే కొన్ని రోజులు వేచి చూడాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు.

ఈ క్రమంలోనే నవంబర్ 23 సోమవారం సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తార‌ని సీఎం తెలిపారు. ధరణి పోర్టల్ అద్భుత ప‌నితీరుప‌ట్ల సీఎం కేసీఆర్ అధికారుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

ఈ సమీక్షలో మంత్రులు పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Advertisement