Advertisement

  • తెలంగాణలో వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాలపై దాడులు

తెలంగాణలో వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాలపై దాడులు

By: chandrasekar Sat, 15 Aug 2020 11:26 AM

తెలంగాణలో వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాలపై దాడులు


తెలంగాణలో వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా అధికంగా ఫిర్యాదులు రావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఏకకాలంలో దాడులు చేేపట్టారు.

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల ఇవ్వడంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ప్రతి దుకాణంలో వివరాలను అధికారులు పరీక్షించడం వల్ల జరిగిన అవక తవకలు బయట పడుతాయి.

ప్రతి దుకాణాలలో రికార్డులను వ్యవసాయ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అధికారుల దాడులతో కొన్ని ఎరువుల దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. రికార్డుల తనిఖీలో అవకతవకలతో జిల్లా కేంద్రంలోని ఒక ఎరువుల దుకాణం హోల్ సేల్ లైసెన్స్ ను అధికారులు రద్దు చేశారు. దీంతో నగరంలోని కొన్ని దుకాణాలు మూసివుంచారు.

Tags :

Advertisement