అంతర్జాతీయ విమానాల రాకపోకల కోసం అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో ఒప్పందాలు
By: chandrasekar Fri, 17 July 2020 4:57 PM
కరోనావైరస్ వ్యాప్తిని
నివారించేందుకు కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా 4 నెలల క్రితం అంతర్జాతీయ
విమానాల రాకపోకలను నిలిపేసిన సంగతి తెలిసిందే. అమెరికా, ఫ్రాన్స్
తరహాలోనే త్వరలోనే బ్రిటన్తోనూ ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోనున్నట్టు మంత్రి
హర్దీప్ పురి వెల్లడించారు.
ఆ తర్వాత తొలిసారిగా
అంతర్జాతీయ విమానాల రాకపోకల కోసం అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో తాజాగా భారత్ ఒప్పందాలు
కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల నేపథ్యంలో జులై 17 నుంచి అమెరికా-భారత్ మధ్య, జూలై 18 నుంచి
ఫ్రాన్స్- భారత్ దేశాల మధ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పౌర
విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం మీడియాకు పలు వివరాలు
వెల్లడించారు.
అమెరికా, భారత్
మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారం యూఎస్కి చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ జులై 17 నుంచి
31 మధ్య 18
విమానాలను నడుపనుంది. ఢిల్లీ- న్యూయార్క్ మధ్య ప్రతిరోజు
ఢిల్లీ - న్యూయార్క్, ఢిల్లీ
- శాన్ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజులపాటు విమాన సేవలు అందుబాటులోకి
రానున్నాయి. అలాగే ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్ లైన్స్ సైతం జూలై 18 నుంచి
ఆగస్టు 1 మధ్య 28 విమాన
సర్వీసులను నడుపనుందని మంత్రి హర్దీప్ పురి తెలిపారు.
జర్మనీకి చెందిన
లుఫ్తాన్సా ఎయిర్లైన్స్తో ఒప్పందం పూర్తి కావచ్చిందని త్వరలోనే జర్మనీ-భారత్
మధ్య సైతం విమాన సేవలు ప్రారంభం అవుతాయని మంత్రి హర్దీప్ పురి తెలిపారు. అమెరికా, ఫ్రాన్స్
తరహాలోనే త్వరలోనే బ్రిటన్తోనూ ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోనున్నట్టు మంత్రి
హర్దీప్ పురి వెల్లడించారు. ఢిల్లీ - లండన్ మధ్య రోజుకు రెండు చొప్పున విమానాలు
నడిపే విధంగా ఈ ఒప్పందం ఉన్నట్టు మంత్రి స్పష్టంచేశారు.