Advertisement

  • వాళ్ళిద్దరికీ కరోనా నెగెటివ్ అనగానే నా కంట్లో నీళ్లు ఆగలేదు ..అమితాబ్ బచ్చన్

వాళ్ళిద్దరికీ కరోనా నెగెటివ్ అనగానే నా కంట్లో నీళ్లు ఆగలేదు ..అమితాబ్ బచ్చన్

By: Sankar Tue, 28 July 2020 10:45 AM

వాళ్ళిద్దరికీ కరోనా నెగెటివ్ అనగానే నా కంట్లో నీళ్లు ఆగలేదు ..అమితాబ్ బచ్చన్



ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం క‌రోనాతో పోరాడుతూ కాలం గ‌డుపుతున్నారు. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా కాటుకి గుర‌వుతున్నారు. ఇటీవ‌ల బ‌చ్చ‌న్ ఫ్యామిలీకి చెందిన అమితాబ్, అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్, ఆరాధ్య క‌రోనా బారిన ప‌డ‌గా, రీసెంట్‌గా ఐష్‌, ఆరాధ్య‌ల‌కి నెగెటివ్ అనే తేలింది. దీంతో వారిద్ద‌రిని ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అభిషేక్, అమితాబ్ నానావ‌తి ఆసుప‌త్రిలోనే చికిత్స పొందుతున్నారు.

అయితే తన కోడలు, మనవరాలు కరోనా నెగిటివ్‌తో డిశ్చార్జ్ అయ్యారనే విషయం తెలిసి కళ్లలో నీళ్లు ఆగలేదని బిగ్ బి అమితాబచ్చన్ తన తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. నీ ఆశీస్సులు అనంతం అంటూ ట్వీట్ చేశారు. క‌రోనాతో బాధ‌ప‌డుతున్న అమితాబ్ తన సోష‌ల్ మీడియా ద్వారా అనుభ‌వాల‌ని వివ‌రిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. బిగ్ బీ కూడా త్వ‌ర‌గా కోలుకొని ఇంటికి వెళ్లాల‌ని యావత్ దేశం ప్రార్ధ‌న‌లు చేస్తుంది.

కాగా కరోనా కారణంగా ముందుగా అమితాబ్ బచ్చన్ , అభిషేక్ బచ్చన్ హాస్పిటల్ చేరిన విషయం తెలిసిందే ..అయితే ఐశ్వర్య , ఆరాధ్య హోమ్ క్వారంటైన్స్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత వారిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసారు ..దీనితో దేశ వ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా బచ్చన్ ఫామిలీ కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్ధించారు ..అయితే ఐశ్వర్య , ఆరాధ్య కోలుకున్నప్పటికీ ఇంకా అమితాబ్ , అభిషేక్ మాత్రం హాస్పిటల్ లోనే ఉన్నారు ..

Tags :
|

Advertisement