Advertisement

  • ప్రముఖ ఏరో స్పేస్ శాస్త్రవేత్త రొడ్డం నరసింహ కన్నుమూత

ప్రముఖ ఏరో స్పేస్ శాస్త్రవేత్త రొడ్డం నరసింహ కన్నుమూత

By: Sankar Tue, 15 Dec 2020 10:03 PM

ప్రముఖ ఏరో స్పేస్ శాస్త్రవేత్త  రొడ్డం నరసింహ కన్నుమూత


ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఫ్రొఫెసర్ రొడ్డం నరసింహ కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం కావడంతో డిసెంబర్ 8న బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస తీసుకున్నారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. నేడు(డిసెంబర్15న) నరసింహ అంత్యక్రియలు నిర్వహించనున్నామని వారు తెలిపారు. మరోవైపు నరసింహ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.

అత్యుత్తమ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ నరసింహ అనీ, భారతదేశ పురోగతి, సైన్స్ ఆవిష్కరణల శక్తిని పెంచేందుకు కృషి చేశారని మోదీ ట్వీట్‌ చేశారు

Tags :

Advertisement