Advertisement

  • మాస్క్ పెట్టుకోలేదని ఫైన్ వేసినందుకు పది లక్షల పరిహారం కోరిన వ్యక్తి

మాస్క్ పెట్టుకోలేదని ఫైన్ వేసినందుకు పది లక్షల పరిహారం కోరిన వ్యక్తి

By: Sankar Fri, 18 Sept 2020 4:23 PM

మాస్క్ పెట్టుకోలేదని ఫైన్ వేసినందుకు పది లక్షల పరిహారం కోరిన వ్యక్తి


కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని అన్ని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి..మాస్క్ పెట్టుకోనివారికి ఫైన్ లు కూడా విధిస్తున్నాయి..అయితే ఆలా ఫైన్ కట్టిన ఒక వ్యక్తికి కోర్ట్ కు ఎక్కాడు..ఢిల్లీలోని ఓ న్యాయవాదికి స్థానిక పోలీసు అధికారులు ఫైన్‌ వేశారు. బహిరంగ ప్రదేశంలో మాస్క్‌ లేకుండా కారు డ్రైవింగ్‌ చేస్తున్నాడని రూ. 500 జరిమానా విధించారు. అయితే అధికారుల తీరుపై న్యాయవాది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

దీనిపై న్యాయవాది ఢిల్లీ హైకోర్టును సైతం ఆశ్రయించారు. పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమించి తనకు జరిమానా విధించారని, దానికి గాను పదిలక్షల రూపాయల నష్టపరిహారం కట్టించాలని కోర్టులో దావా వేశారు. అతని వాదన ప్రకారం.. తన వ్యక్తిగత కారులో సింగిల్‌గా ప్రయాణం చేస్తున్నా అని, ఆ సమయంలో మాస్క్‌ అవసరం లేదని కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల్లో ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజల మధ్యకు వచ్చిన సమయంలో తాను ఖచ్చితంగా మాస్క్‌ ధరిస్తున్నా అని, ఒంటరిగా ఉన్న సమయంలోనే వాడటంలేదని తెలిపారు. కోవిడ్‌ నిబంధనాలు పాటిస్తున్నా.. అన్యాయంగా తనను వేధింపులకు గురిచేశారని, తనతో ఫైన్‌ కట్టించారని తన పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు.

అంతేకాకుండా పోలీసులు తీరు తన పరువుకు భంగం కలిగేలా ఉందని, మానసిన ఒత్తిడికి గురిచేశారని ఆరోపించారు. ఒంటరిగా ఉన్న సమయంలో మాస్క్‌ ధరించకపోవడం ఇతరులకు ఏ విధంగానూ హానికరం కాదన్నారు. వారి తీరును తప్పుబడుతూ రూ.10 లక్షల నష్టపరిహారం కట్టించే విధంగా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇ‍వ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై జస్టిస్‌ నవీన్‌ చావ్లా సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం నవంబర్‌ 18న కోర్టు విచారణ జరుపనుంది.


Tags :
|
|

Advertisement