రానా హీరోగా అడ్వెంచరస్ హిందీ సినిమా..
By: chandrasekar Fri, 02 Oct 2020 3:59 PM
రానా తాజాగా ఓ హిందీ
చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'గృహం' ఫేమ్ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్న ఈ
సినిమాలో రానా హీరోగా నటించనున్నాడు. మిలింద్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన
రానా వెంటనే ఓకే చెప్పేశాడట. మంత్ర తంత్రాలు అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే
అడ్వెంచరస్ సినిమాగా దీనిని తెరకెక్కించనున్నారు. దీంతో ఈ సినిమాలో గ్రాఫిక్స్ను
విపరీతంగా వాడనున్నారట. అందులో భాగంగా వీఎఫ్ఎక్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుందని
సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మాత సురేష్ బాబు, గోపీనాథ్ ఆచంట కలసి సంయుక్తంగా భారీ బడ్జెట్టుతో
నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్ల్లో
విడుదలకానుంది.
ఈ సినిమాతో పాటు ఓ వెబ్
సిరీస్కు కూడా రానా చేస్తున్నాడు. శ్రుతి హాసన్, రానా దగ్గుబాటితో కలిసి
వెబ్ సిరీస్లో నటించనున్నారు. ఈ వెబ్సిరీస్ కోసం ప్రముఖ తెలుగు దర్శకుడు కథను
అదించారని, నెట్ఫ్లిక్స్ దీనిని నిర్మించబోతోందని సమాచారం. వెబ్సిరీస్ను
మొదటి తెలుగు భాషలో చిత్రీకరించి ఆ తర్వాత బహుళ భాషల్లో విడుదల చేయబోతున్నారట. ఈ
వెబ్ సిరీస్ పది ఎపిసోడ్ల థ్రిల్లర్ గా ఉండనుందని సమాచారం. ఇక రానా మిగితా
సినిమాల విషయానికి వస్తే.. ఆయన మరో ప్యాన్ ఇండియన్ సినిమా 'హాథీ
మేరే సాథీ'. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న ఈ సినిమా షూటింగ్
పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
ఇది అడవి బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. రానా మరో సినిమా విరాట పర్వం. వేణు ఊడుగుల
దర్శకత్వంలో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్లో రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
సాయి పల్లవి మరో కీలకపాత్రలో నటిస్తోంది.
యంగ్ అండ్ టాలెంటెడ్
డైరెక్టర్ ‘వేణు ఊడుగుల’ ఈ సినిమాకు దర్శకుడు. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని
1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల
వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.
నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి
పల్లవి జానపద గాయని పాత్రలో చేస్తోంది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరించిన కరోనా
కారణంగా వాయిదాపడింది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో తిరిగి
మొదలవుతుంది.