తెరాస కు షాకిచ్చిన ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ ...తిరిగి కాంగ్రెస్ గూటికి
By: Sankar Mon, 28 Dec 2020 7:04 PM
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో వరుస ఓటములను ఎదుర్కొంటున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఊహించిన షాక్ ఎదురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు.
గతకొంతగా ఆ పార్టీ నాయకత్వ తీరుతో తీవ్రంగా విభేదిస్తున్న మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ సోమవారం రాజీనామా సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన ప్రవీణ్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ నేతలతో విభేదించిన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.
Tags :
adibatla |
congress |