Advertisement

  • కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును దక్కించుకున్న అదానీ గ్రూపు

కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును దక్కించుకున్న అదానీ గ్రూపు

By: chandrasekar Fri, 04 Sept 2020 4:16 PM

కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును దక్కించుకున్న అదానీ గ్రూపు


ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని పోర్టు కాంట్రాక్టును కూడా కైవసం చేసుకుంది. దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ ఏపీలోని కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును సైతం దక్కించుకుంది. ఇక మీదట పోర్టు వ్యవహారాలు అదానీ సంస్థ చూసుకోనుంది.

ఇందుకుగాను ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ కూడా అప్రూవల్ ఇచ్చింది. ఒకటిన్నర నెల తర్వాత కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్ కు కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు లభించింది. దీనికోసం మొత్తం 13,572 కోట్ల రూపాయల డీల్ ను కుదుర్చుకుంది. కృష్ణ పట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) సంస్థకు 75శాతం వాటాను కేటాయించింది.

కృష్ణ పట్నం పోర్టు బాధ్యతలు ఇకపై అదానీ గ్రూప్ కే ప్రభుత్వం తరపున ఎన్.ఓ.సి. ఇచ్చామని ఏపీ భారీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాకు తెలిపారు. అదానీ గ్రూపు దేశవ్యాప్తంగా చాలా కాంట్రాక్టులు పొందాయి. ఇప్పుడు ఏపీ లో కూడా తన ఆది పత్యాన్ని చూపుతుంది.

Tags :
|
|
|

Advertisement