డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణకు నటి సంజనా గల్రాని
By: chandrasekar Wed, 09 Sept 2020 09:58 AM
అనతి కాలంలో డ్రగ్స్ కేసుకు సంబంధించి చాలా మంది సినీ నటులు బయట పడుతున్నారు. ఇందులో భాగంగా పోలిసు విచారణకు నటి సంజనా గల్రాని తీసికెళ్ళినట్లు తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్నది. డ్రగ్స్ మాఫియాతో చందన సీమలో పలువురు నటీనటులకు సంబంధాలున్నాయని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరాలు ప్రశ్నించడం కోసం బెంగళూరు పోలీసులు మంగళవారం నటి సంజనా గల్రానిని సీసీబీ హెడ్క్వార్టర్స్కు తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం సంజానా ఇంటిపై సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ కేసులో నిందితుడు రాహుల్ శెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా సంజనా నివాసంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రశ్నిస్తున్న రెండో నటి సంజనా. ఇప్పటికే మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా ఆరోపణలతో అరెస్ట్ అయిన నటి రాగిని ద్వివేదిని పోలీసులు విచారిస్తున్నారు. వీటిపై ఇంకా పూర్తి వివరాలు అందాల్సి వుంది.