సీఐ మురళీకృష్ణ పై ఆధారాలు ఏసీబీ కార్యాలయానికి అందించిన నటి సాయిసుధ
By: chandrasekar Thu, 30 July 2020 4:27 PM
ఎస్ఆర్ నగర్ సీఐ
మురళీకృష్ణ పై ఆధారాలను ఏసీబీ కార్యాలయానికి నటి సాయిసుధ అందించారు. టాలీవుడ్లో
పేరుమోసిన సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు తనను మోసం
చేశారంటూ మొదలైన సినీనటి శ్రీసుధ అలియాస్ సాయిసుధ ఫిర్యాదు చేసిన కేసు మలుపులు
తిరుగుతోంది. తాజాగా నటి సాయి సుధ ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్ఆర్ నగర్ సీఐ
మురళీకృష్ణపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను నటి సమర్పించారు.
తనను శ్యామ్ కే నాయుడు
మోసం చేశాడంటూ ఇచ్చిన ఫిర్యాదు విషయంలో సాయం చేసేందుకు తన వద్ద నుంచి రూ.5 లక్షల
వరకు సీఐ వసూలు చేశారని ఇదివరకే సాయిసుధ ఆరోపించారు. కేసు దర్యాప్తులో సాయం
చేయకపోగా శ్యామ్ కే నాయుడుకు సహకరించారని, ఈ క్రమంలో నకిలీ పత్రాలు సృష్టించారని ఆమె చెబుతున్నారు.
తన వద్ద ఉన్న ఆధారాలు
సమర్పించేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చినట్లు నటి సాయిసుధ తెలిపారు. సీఐ
మురళీకృష్ణ తన వద్ద నంచి డబ్బులు వసూలు చేయడం, ఫోన్లో మాట్లాడిన సాక్ష్యాలను సమర్పించినట్లు
వివరించారు. కాగా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ
ఆర్టిస్ట్ సాయి సుధ గతంలో ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.