నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలన్న నటి ప్రియమణి
By: chandrasekar Thu, 30 July 2020 4:17 PM
సౌత్ ఫిలిం ఇండస్ట్రీ
తమిళం, తెలుగు, కన్నడ
చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ప్రియమణి లేడీ విలన్ పాత్రలో నటించాలని ఉందని
చెబుతున్నారు. 2004లో ‘కన్గళాల్ ఖైదు సెయ్’ చిత్రం ద్వారా తమిళ సినీ
పరిశ్రమకు పరిచయమైన ప్రియమణి ‘పరుత్తివీరన్’ చిత్రంలో నటించి జాతీయ అవార్డు కూడా
అందుకున్నారు.
తనకు లేడీ విలన్ పాత్రలో
నటించాలని ఉందని తెలిపారు. ప్రస్తుతం లాక్డౌన్లో
ఇంటివద్దే ఉంటున్న ప్రియమణి నెటిజన్లతో సరదాగా మాట్లాడుతూ ‘విరాట్ పర్వం’ అనే
చిత్రంలో తాను నక్సలైట్ పాత్రలో నటిస్తున్నానని, లాక్డౌన్ రోజుల్లో
కొత్త కథలు వింటున్నానని చెబుతూ గతంలో హీరోలకు అధికంగా గౌరవించి హీరోయిన్లకు
తక్కువగా చూసేవారని, ప్రస్తుతం ఇద్దరినీ సమానంగా గౌరవిస్తున్నారని
వివరించారు.
రమ్యకృష్ణ నటించిన
‘నీలాంబరి’ వంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని ఉంది, అది
ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు, ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లోనూ నటించాలని
ఆశపడుతున్నా, లాక్డౌన్ ఎప్పుడు తొలగిస్తారో, షూటింగ్లు
ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియడ లేదు.
ప్రస్తుతం టీవీ
ప్రోగ్రామ్స్లో అధికంగా పాల్గొంటున్నా అని
ప్రియమణి వివరించారు. తనకు పారితోషికం ముఖ్యం కాదని మంచి పాత్రలో నటించి
ప్రేక్షకులను మెప్పించడమే తన ఆశయమని చెప్పారు. ప్రస్తుతం వచ్చే పారితోషికంతోనే సంతృప్తి చెందుతున్నానని, మంచి
భర్త, కుటుంబంతో
హాయిగా జీవనం సాగిస్తున్నానని తెలిపారు.