Advertisement

  • సోష‌ల్ మీడియాలో అభిమానులపై చిర్రెత్తిపోయిన నటి లావ‌ణ్య త్రిపాఠి

సోష‌ల్ మీడియాలో అభిమానులపై చిర్రెత్తిపోయిన నటి లావ‌ణ్య త్రిపాఠి

By: chandrasekar Mon, 19 Oct 2020 10:22 AM

సోష‌ల్ మీడియాలో అభిమానులపై చిర్రెత్తిపోయిన నటి లావ‌ణ్య త్రిపాఠి


సోష‌ల్ మీడియాలో అభిమానులపై నటి లావ‌ణ్య త్రిపాఠి చిర్రెత్తిపోయింది. ఆమె పెళ్లి గురించి పదే పదే ప్రశ్నించడంతో అభిమానులపై విసుక్కుంది. త‌న గ్లామ‌ర్‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టిన అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన ఈ అమ్మ‌డు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించింది. ప్ర‌స్తుతం చావు క‌బురు చ‌ల్ల‌గా, ఏ1 ఎక్స్ ప్రెస్ అనే చిత్రాల‌లో న‌టిస్తున్న లావ‌ణ్య కొద్ది రోజులుగా కరోనా వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వ‌స్తున్న లావ‌ణ్య రెగ్యుల‌ర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌లో ఆనందాన్ని నింపుతుంది. తాజాగా లావ‌ణ్య త్రిపాఠి నెటిజన్స్‌తో కొద్ది సేపు ముచ్చ‌టించింది. ఈ క్ర‌మంలో ప‌లువురు నెటిజన్స్ లావ‌ణ్య పెళ్ళి గురించి ఆరాలు తీసారు.

సోషల్ మీడియాలో ఈ అమ్మ‌డినే డైరెక్ట్‌గా పెళ్లి ఫిక్స్ అయిందట కదా అని ఓ నెటిజ‌న్స్ అడిగితే, మ‌రో నెటిజ‌న్ పెళ్ళెప్పుడు అంటూ ప్ర‌శ్నించారు. ఇందుకు కార‌ణం లావ‌ణ్య త్రిపాఠి చేతికి ఉన్న ఉంగ‌రం. ఆమె చేతికి ఉంగ‌రం ఉండ‌డంతో మీ నిశ్చితార్థం అయిపోయిందా? మరి పెళ్లి ఎప్పుడు? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి స‌మాధానం ఇచ్చిన లావ‌ణ్య తనకు నిశ్చితార్థం కాలేదని క్లారిటీ ఇచ్చింది. అయినా అమ్మాయిలు వేలికి ఉంగరం పెట్టుకుంటే నిశ్చితార్థం పూర్తయినట్లేనా? అమ్మాయిలు ఉంగరాలు కొనుక్కోలేరా? అంటూ ఫైర్ అయింది. ఇంతలో మరో నెటిజన్ పెళ్ళెప్పుడు అక్కా? అని మరో ప్రశ్న వేయడంతో చిర్రెత్తిపోయిన ఆమె మా‌ పేరెంట్స్‌కే లేని బాధ మీకెందుకు? అంటూ గట్టిగానే సమాధానం చెప్పింది. ఇందువల్ల ఆమె అభిమానులు కొంత నిరాశకు లోనైయ్యారు.

Tags :
|
|

Advertisement