అంబేద్కర్ విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష హాజరైన నటి హేమ
By: chandrasekar Mon, 28 Sept 2020 4:02 PM
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్షకు నటి హేమ హాజరైనారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా
వ్యాప్తంగా ఆదివారం పది అధ్యయన కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 987 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోగా 580 మంది
హాజరయ్యారు. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జరిగిన అర్హత పరీక్షలో సినీ
నటి హేమ పరీక్ష రాశారు. నల్గొండలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
సార్వత్రిక విశ్వవిద్యాలయం అర్హత పరీక్షకు సినీ నటి, ‘మా’ ఉపాధ్యక్షురాలు హేమ (53) హాజరయ్యారు. డిగ్రీలో ప్రవేశం పొందేందుకు
నిర్దేశించిన విద్యార్హతలు లేని వారికి యూనివర్సిటీ అర్హత పరీక్ష నిర్వహిస్తుంది.
ఈ అర్హత పరీక్ష హాజరు
కావడానికి తాను రామోజీఫిల్మ్సిటీలో ‘కొండాపురం’ సినిమా చిత్రీకరణలో ఉన్నానని
అందుకే పరీక్ష కేంద్రంగా నల్గొండ ఎంచుకొన్నట్లు హేమ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా
డిగ్రీ ప్రవేశం కోసం అర్హత పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తున్నా వీలు కాలేదన్నారు.
డిగ్రీతోపాటు కంప్యూటర్ కోర్సులు నేర్చుకోనున్నట్లు ఆమె తెలిపారు. ఇక ఈ పరీక్ష
ఫలితాలు వెంటనే ఆన్లైన్లో వెలువడతాయని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్
బి.ధర్మానాయక్ తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు వెంటనే తమకు నచ్చిన అధ్యయన
కేంద్రంలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. దీంతో తాను డిగ్రీ
చదవనున్నట్లు తెలిపారు.