బెయిల్ పై విడుదలైన నటి రియా చక్రవర్తి
By: chandrasekar Thu, 08 Oct 2020 09:15 AM
సుశాంత్ మరణం తరువాత
బాలీవుడ్ డ్రగ్ కేసులో అరెస్టు చేయబడ్డ రియా చక్రవర్తి బెయిల్ పై విడుదలైంది.
సుశాంత్ మరణం కేసులో డ్రగ్స్ లింక్స్ కోణంలో అరెస్టైన నటి రియా చక్రవర్తి
బుధవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.
బెయిల్ కోసం రియా బాంబే హైకోర్టును ఆశ్రయించగా బుధవారం పలు కండిషన్లు, రూ.లక్ష
పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రియా బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
డ్రగ్స్ లింక్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో
అధికారులు సెప్టెంబర్ 8న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
చాలా మంది బాలీవుడ్
నటీమణులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయబడ్డారు. కేసు విచారణలో భాగంగా రియా సుమారు
నెలరోజులపాటు జైలులో ఉన్నారు. రియా చక్రవర్తి సుమారు నెల రోజుల తర్వాత తన
ఇంట్లో సొంత బెడ్పై విశ్రాంతి తీసుకోనున్నారని విడుదల సందర్భంగా ఆమె తరపు
లాయర్ సతీశ్ మానషిండే పేర్కొన్నారు. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయిన రియా సోదరుడు
షోవిక్ బెయిల్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో షోవిక్ జైలులోనే ఉండనున్నారు. ఈ
కేసులో షోవిక్, మేనేజర్, పని మనిషి దీపక్ తోపాటు మరికొంతమందిని ఎన్సీబీ
అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియాకు మాత్రం బెయిల్ అవకాశం దొరికింది.