Advertisement

  • న్యాయమూర్తుల మీద కామెంట్స్ చేసిన నటుడు సూర్య మీద ఎటువంటి చర్యలు లేవు ..మద్రాస్‌ హైకోర్టు

న్యాయమూర్తుల మీద కామెంట్స్ చేసిన నటుడు సూర్య మీద ఎటువంటి చర్యలు లేవు ..మద్రాస్‌ హైకోర్టు

By: Sankar Fri, 18 Sept 2020 7:53 PM

న్యాయమూర్తుల మీద కామెంట్స్ చేసిన నటుడు సూర్య మీద ఎటువంటి చర్యలు లేవు ..మద్రాస్‌ హైకోర్టు


ఇటీవల న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలు చేసిన తమిళ స్టార్ నటుడు సూర్య మీద ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోబోమని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం తెలిపింది. నీట్‌ పరీక్షల నిర్వహణను ఉద్దేశించి సూర్య న్యాయమూర్తులను కించపరిచే విధంగా ట్వీట్లు చేశాడనే వాదనలపై ఈమేరకు హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే, సూర్య వ్యాఖ్యలు అనవసరమైన, సమర్థనీయం కానివని పేర్కొంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ప్రజా స్వామ్య పరిరక్షణకు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందని వెల్లడించింది. తమ పనితీరును తక్కువ చేసి మాట్లాడటం తగదని హితవు పలికింది. కాగా, నీట్‌ పరీక్షల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై నటుడు సూర్య స్పందిస్తూ.. ‘విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదమని, ఇది తన మనసుని ఎంతగానో కలచివేసింది. కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలిస్తున్నారు. విద్యార్థులను మాత్రం భయం లేకుండా పరీక్షలు రాయమని ఆదేశిస్తారు’అని ట్వీట్లు చేశారు. దీంతో వివాదం రాజుకుంది

Tags :

Advertisement