Advertisement

  • కరోనా కంటే అదే అత్యంత డేంజర్ అంటు వ్యాధి ..హీరో రామ్

కరోనా కంటే అదే అత్యంత డేంజర్ అంటు వ్యాధి ..హీరో రామ్

By: Sankar Mon, 17 Aug 2020 7:18 PM

కరోనా కంటే అదే అత్యంత డేంజర్ అంటు వ్యాధి ..హీరో రామ్


విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద దుర్ఘటనలో 10 మంది దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుసంచలనంగా మారింది. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం రాజకీయ, కుల రంగు పులుముకుంది.అయితే ఈ వ్యవహారంలోకి హీరో రామ్ ఎంటర్ అవ్వడంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా కుల విమర్శలు చేయడం మొదలు పెట్టారు..

అయితే రామ్ వీటిపైనా మల్లి ట్విట్టర్ లో స్పందించాడు.. నా ప్రియాతి ప్రియమైన సోదర, సోదరీమణులకు.. ప్రస్తుతం కరోనా వైరస్ కంటే వేగంగా కులం అనే జబ్బు వ్యాప్తి చెందుతోంది. వాస్తవానికి కుల జబ్బు కరోనా కంటే తీవ్రమైన అంటువ్యాధి మాత్రమే కాక అత్యంత ప్రమాదకారి.

ఈ కుల జబ్బును కొందరు నిశ్శబ్ధంగా వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. ఎదుటి వారు ఎంత బలంగా ఈ కుల రొచ్చులోకి లాగాలని చూసినా ఎట్టిపరిస్థితుల్లోనూ వారి వలలో పడొద్దు. ఈ గొప్ప మంచి పని కోసం అందరం చేతులుకలుపుదాం.’’ అని రామ్ ట్వీట్ చేశారు.

Tags :
|
|
|

Advertisement