Advertisement

  • ప్రముఖంగా వాడే టిక్ టాక్ ను బ్యాన్ చేయడంతో షాక్ కు గురైన నటన ప్రియులు

ప్రముఖంగా వాడే టిక్ టాక్ ను బ్యాన్ చేయడంతో షాక్ కు గురైన నటన ప్రియులు

By: chandrasekar Tue, 30 June 2020 5:22 PM

ప్రముఖంగా వాడే టిక్ టాక్ ను బ్యాన్ చేయడంతో షాక్ కు గురైన నటన ప్రియులు


చైనాపై వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతున్న ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం ఆ దేశంతో ఉన్న సంబంధాలన్నీ ఒక్కొక్కటిగా తెంచుకుంటుంది. తాజాగా ఇండియాలో ఉన్న చైనా యాప్స్ అన్నింటిపై కూడా బ్యాన్ విధించింది. ఇందులో మోస్ట్ పాపులర్ టిక్ టాక్ కూడా ఉంది. ఈ యాప్ ఇండియాలో కూడా కొన్ని కోట్ల మంది వాడుతున్నారు. దీని వల్ల కొన్ని నష్టాలున్నాయి. మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెత్త వీడియోలు చేసే వాళ్ల నుంచి టిక్ టాక్ నుంచి విముక్తి దొరుకుతుంది. అయితే కొందరు మాత్రం తమ టాలెంట్ చూపించుకోడానికి ఈ యాప్‌ను ప్లాట్ ఫామ్‌గా వాడుకుంటున్నారు.

ఇక సినిమా వాళ్లు కూడా ఈ యాప్‌ను బాగానే యూజ్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలు రితేష్ దేశ్‌ముఖ్, హీరోయిన్ శిల్పా శెట్టి సహా తెలుగు ఇండస్ట్రీలో కూడా సందీప్ కిషన్, మంచు విష్ణు లాంటి హీరోలు కూడా వాడుతున్నారు. అంతా తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ యాప్ వాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లందరికీ ఒకేసారి షాక్ తగలడం ఖాయం. మరోవైపు కొన్ని లక్షల మంది ఈ యాప్స్ నుంచి పాపులర్ అయ్యారు. స్టార్స్ కూడా అయిపోయారు. వాళ్లకు కూడా టిక్ టాక్ బ్యాన్‌తో చుక్కలు కనిపిస్తున్నాయి. ఏమి చేయాలో తెలియక హైరానా పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది టిక్ టాక్ పుణ్యమా అని స్టార్స్ అయిన వాళ్లున్నారు. కమెడియన్స్‌గా ఉప్పల్ బాలు లాంటి వాళ్లు జబర్దస్త్ వరకు వచ్చారంటే కారణం టిక్ టాక్. మరికొందరు కేవలం ఈ టిక్ టాక్ వీడియోల వల్లే సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు. రాక్షసుడు సినిమాలో చేసిన పాప దియాకు టిక్ టాక్ నుంచే ఆఫర్ వచ్చింది. నిజంగా టాలెంట్ చూపిస్తున్న వాళ్లకు కూడా టిక్ టాక్ బ్యాన్ నష్టమే కానీ దేశం ముందు అవన్నీ తక్కువే అంటున్నారు.

Tags :

Advertisement